మండలి ఛైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లి కార్యదర్శి ఛాంబర్లో గుత్తా సుఖేందర్ మండలి ఛైర్మన్ పదవికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సత్యవతి, ఎర్రబెల్లి దయాకర్రావులు, ఇతరులు హాజరయ్యారు.