హైదరాబాద్: ఈ నెల 25వ తేదీ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రకటించారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ సూర్యపేట జిల్లా హుజూర్నగర్లో గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడించారు. కుల వృత్తులకు చేయుత ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం. గొల్ల, కురుమలకు 75శాతం రాయితీపై గొర్రెలనుపంపిణీ చేస్తున్నాం. ఒక యూనిట్ విలువ రూ.1.25 లక్షలు ఉంటుంది. ఇందులో 75శాతం వాటా రాష్ట్రప్రభుత్వానిది, 25శాతం వాటా లబ్ధిదారుడిది ఉంటుందని పేర్కొన్నారు. మొదటి విడుతలో 3,34619 మందికి పంపిణీ చేశాం. ఇంకా 3,62,047 మందికి పంపిణీ చేయాల్సి ఉందని తెలిపారు.