ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2019, 05:46 PM

సూర్యపేట:  విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ సూర్యపేటలో లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అనీ, పేద బిడ్డల పెళ్లిల్ల కోసం తల్లిదండ్రులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గమనించిన సీఎం ప్రభుత్వం తరఫున వారిని ఆదుకోవాలని ఈ పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పేద ప్రజలు తమ కూతుర్ల పెళ్లిల్ల కొరకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం వారిని ఆదుకోవాలనీ, ఆర్థికంగా వారిపై భారం తగ్గించాలని ప్రవేశపెట్టిన పథకం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్. ఆడబిడ్డల పెళ్లిళ్లకు సకాలంలో డబ్బులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ పథకంలో భాగంగా వారికి 1,00,116 రూపాయల చెక్కులను రాష్ట్రప్రభుత్వం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమోయ్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మెన్ జి. వెంకట నారాయణ గౌడ్, ఆర్డీవో రామ్మోహన్ రావు, సూర్యపేట గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ బి. రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ మెంబర్ జీ డీ భిక్షం సంజీవ్ నాయక్, లబ్దిదారులు, ప్రజలు పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com