రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ శనివారం పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక కార్యాచరణ ఏ విధంగా అమలవుతోందని ఆయన కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ , ఎంపీడీవో, సర్పంచ్, గ్రామ ప్రత్యేకాధికారి, కార్యదర్శి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.