మంచిర్యాల మున్సిపాలిటీలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్,శాసనసభ్యుడు నడిపెళ్లి దివాకర్ రావు సోమవారం బతుకమ్మ చీరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ,ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి మహిళ ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మ ఆడుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం బతుకమ్మ పండుగకు నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ కుల,మతాలకు అతీతంగా ప్రతి పండుగ కు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.