పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఐదు రోజుల పాటు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణలోని నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, పెద్దపల్లిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలోని అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాలోని శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.