హుజూర్ నగర్ ఉపఎన్నికలో భారీ పోలింగ్ జరగడం పట్ల రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. సాయంకాలానికి 82 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఇంత భారీ పోలింగ్ నమోదైనందుకు మంత్రి ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి అడ్డం పట్టిన ఉప ఎన్నికని అభిప్రాయపడ్డారు. తెరాస అభ్యర్థి సైది రెడ్డి గెలుపు ఖాయమన్నారు.