ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ తెలంగాణ ప్రజల హక్కులు కాలరాస్తున్న: పొన్నాల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 06:56 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా ప్రజల హక్కులను కాలరాస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. హౌస్ అరెస్టు చేసినందుకు నిరసనగా ఆయన నల్ల దుస్తులు ధరించి మీడియాతో మాట్లాడారు. మంత్రి రానందుకు కేసీఆర్ తెలంగాణా సెంటిమెంటును రెచ్చగొట్టారని అన్నారు. అప్పుడు ఉద్యమం చేసి ఇప్పడు హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. మూడు రోజుల్లో రెండు సార్లు గృహ నిర్బంధం ఏంటి….? నాడు కాంగ్రెస్ కూడా ఇలాగే చేసి ఉంటే పరిస్థితి ఎలా వుండేది ? అని పొన్నాల ప్రశ్నించారు. ఇది ఒక్క ఆర్టీసీ కార్మికుల సమస్య కాదని, కేసీఆర్ హమీలతో మోసపోయిన ప్రతి ఒక్కరి సమస్య అని అన్నారు. ఆర్టీసీకి మద్దతుగా ఉద్యోగులు, నిరుద్యోగ యువత తో పాటు అన్ని వర్గాలు కలసి రావాలన్నారు. కోర్టు అన్నా,  గవర్నర్ అన్నా ఆయనకు నమ్మకం లేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థను లెక్క చేయడం లేదన్నారు. అసలు కేసీఆర్ తాత ముత్తాతలది ఎక్కడ……?అసలు కేసీఆర్ తెలంగాణ వ్యక్తి  కాదన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com