తెలంగాణ హైకోర్టు పనివేళల్లో స్వల్ప మార్పులు చేశారు. కొత్త పనివేళల ప్రకారం ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు పనిచేశాక గంటపాటు భోజన విరామం ఉంటుంది. తర్వాత రెండున్నర నుంచి నాలుగున్నర వరకు కోర్టు పనిచేస్తుంది. కొత్త పని వేళలు ఈనెల 28నుంచి అమల్లోకి వస్తాయని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు.