ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్ద‌ల‌ను ఎదిరించ‌లేక చావులో ఒక‌టైన జంట‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 18, 2019, 07:06 PM

 త‌మ ప్రేమ‌ను ద‌క్కించుకునేందుకు ఆ జంట అర్ధంత‌రంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇన్నాళ్లు వారి ప్రేమను పెళ్లిగా మార్చేందుకు  అంగీకరించని పెద్దలు క‌న్నీటి ప‌ర్యంత‌మై ఇద్దరినీ ఒకే గోతిలో పూడ్చిపెట్టిప హృదయ విదారకర సంఘటన క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌లో జ‌రిగింది. వివ‌రాల‌లోకి వెళితే... కథలాపూర్‌ మండలంలోని రాజారాం తండాకు చెందిన భూక్య శిరీష, లకావత్‌ మహిపాల్‌ పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్ద‌రూ  డిగ్రీ చదువుతునే పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. అయితే వీరి పెళ్లికి అంగీక‌రించ‌ని శిరీష తల్లిదండ్రులు ఇటీవలే వేరే యువకుడితో పెళ్లి చేయడానికి నిశ్చితార్థం చేయ‌టంతో పాటు త్వ‌ర‌లోనే పెళ్లి జ‌ర‌పాల‌ని ఏర్పాట్లు ముమ్మ‌రంగా చేసుకుంటున్న‌ద‌శ‌లో శిరీష మ‌హిపాల్‌కి ఈ వివ‌రాలు ఫోన్‌లో చెప్ప‌డంతో కరీంనగర్‌లో చదువుతున్న మహిపాల్ గ్రామానికి చేరుకున్నాడు.


శుక్రవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన శిరీష, మహిపాల్‌లు సిరికొండ శివారులోని అటవీ ప్రాంతం చేరుకుని పెద్దలను ఎదురించలేక, ప్రేమ పెళ్లి చేసుకోలేక చావే శరణ్యమని నిర్ణయించుకున్నారు. పెద్ద‌ల నిర్వాకంతోతీవ్రమనస్తాపానికి గురైన ఈ ప్రేమికులు ఆ అట‌వీ ప్రాంతంలోనే ఒకే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మ‌హ‌త్య‌పై ఆనోట ఈ నోట విన్న బంధుగ‌ణం ఆదివారం ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకుని పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంత‌ర వారి ఇరువురి మృత‌దేహాల‌ను  ఇద్దరిని ఒకే గోతిలో ఖననం చేశారు. బతికున్నప్పుడు ఏకం కాని ప్రేమజంట చివరికి మరణంలో ఏకం కావడం, వారిద్దరిని కూడా ఒకే గోతిలో ఖననం చేసిన హృదయ విదారకర సంఘటన ప్రతీ ఒక్కరిని కలిచివేసింది.  










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com