ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రూప్ 2 పై స్టే ఇచ్చిన హైకోర్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2019, 03:34 PM

గ్రూప్‌-2 కు సంబంధించిన ఫైనల్‌ ప్రొవిజనల్‌ లిస్ట్‌పై స్టే విధించినట్లు బుధవారం హైకోర్టు తెలిపింది .తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టారాదని టీఎస్‌పీఎస్సీనీ హైకోర్టు ఆదేశించింది. గతంలో గ్రూప్‌ 2 కేసులో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును దిక్కరిస్తూ టీఎస్‌పీఎస్సీ వ్యవహరించిందని గ్రూప్‌ 2 అభ్యర్థులు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వైట్నర్‌, ట్యాంపరింగ్‌, స్క్రాచింగ్‌ చేసిన అభ్యర్థులను సెలక్ట్‌ చేయొద్దని పిటిషన్‌లో పేర్కొన్నారు.


దీంతో గ్రూప్‌ 2 పరీక్షల్లో అందుకు సంబంధించిన జవాబులు తీసివేసి మిగిలిన వారికి ఇంటర్య్వూలలో 1:2 ప్రకారం నియామకాలు జరపాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వెల్లడించింది. అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు లెక్కచేయకుండా మళ్లీ అదే అభ్యర్థులను సెలక్ట్‌ చేసి ప్రొవిజనల్‌ లిస్ట్‌​ను ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ ఫైనల్‌ లిస్టుకు సెలక్ట్‌ కానీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు టీఎస్‌పీఎస్సీ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టరాదని హైకోర్టు తెలిపింది. కాగా, తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com