మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం, ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామానికి చెందిన పలువురు యువ నాయకులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లోకి చేరారు. మంత్రి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీ ని బలోపేతం చేయాలనే ఉద్దేశం తో యువత పార్టీ లోకి చేరుతున్నారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.