ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంగారెడ్డిలో జగ్గారెడ్డికి షాక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2020, 02:44 PM

ఉమ్మడి మదకక్ జిల్లాలో అధికార టిఆర్‌ఎస్‌ దూసుకుని పోతోంది. సంగారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేత జగ్గారెడ్డి షాక్ తగిలింది. ఆయన ఇలాకాలో టీఆర్‌ఎస్‌ 15 స్థానాలను దక్కించుకుని కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. సంగారెడ్డిలో మొత్తం 38 వార్డులుండగా.. టీఆర్‌ఎస్‌ 15, కాంగ్రెస్‌ 14, బీజేపీ 2, ఇండిపెండెంట్లు 3, ఎంఐఎం 1 వార్డును సొంతం చేసుకున్నాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి సంగారెడ్డిలో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కీలకం కానున్నారు. నారాయణఖేడ్‌ మున్సిపాలిటీని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డుల్లో కాంగ్రెస్‌ 8 వార్డుల్లో, టీఆర్‌ఎస్‌ 7 వార్డుల్లో విజయం సాధించారు. అటు సదాశివపేట పురపాలకను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. మొత్తం 26 వార్డుల్లో ఒకటి ఏకగ్రీవంతో టీఆర్‌ఎస్‌ 13 స్థానాలను గెలుపొందగా, కాంగ్రెస్‌ 9, బీజేపీ 1, ఎంఐఎం 2, స్వతంత్రులు 1 వార్డుల్లో గెలుపొందారు.ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో కాంగ్రెస్‌ బోణీ కొట్టింది. ప్రస్తుత సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్‌ 9 వార్డుల్లో, కాంగ్రెస్‌ ఒక చోట, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. మొత్తం ఇక్కడ 20 వార్డులు ఉన్నాయి. గజ్వేల్‌… రాష్ట్రంలో కీలక నియోజకవర్గం కావడం, సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో.. అందరి చూపు దీనిపై నెలకొంది. అలాంటి చోట కాంగ్రెస్‌ తన ఉనికిని చాటుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com