తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పట్టం కట్టిన ప్రజలకు మాజీ ఎంపీ కవిత ధన్యవాదాలు తెలిపారు. గెలిచిన అభ్యర్దులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా కవిత స్పందించారు. ఆమె ఏం అన్నారంటే…తెలంగాణ ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్క అభ్యర్దికి అభినందనలు. ఈ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కేసీఆర్” అని ఆమె ట్వీట్ చేశారు.