హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. జెడ్డా నుంచి ఎయిర్ ఇండియా విమానం ఏఐ 966 విమానంలో హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ప్రయాణికుడి బ్యాగులో కిలో రెండు వందల గ్రాముల బంగారం ఉన్నట్లు స్కానింగ్ లో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.