సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం ప్రాంతానికి చెందిన పీఎన్వీఎస్ సన్నిబాబు(33) సుదర్శనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతను గచ్చిబౌలిలోని జెన్పాక్ట్ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. మంగళవారం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నాగోలు ప్రాంతంలోని అతని బావ సంపత్కుమార్కు సన్నిబాబు ఈ-మెయిల్ పంపించాడు. విషయం తెలుసుకున్న సంపత్ కుమార్ హుటాహుటిన సన్నిబాబు నివాసానికి వెళ్లాడు. లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టారు. అప్పటికే సన్నిబాబు ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.