హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ చెక్పోస్టు సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సును అతి వేగంగా వస్తున్న ఏపీ10AA7733 నంబరు గల కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వెళ్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతాగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కారులో ఉన్న యువకులు మద్యం సేవించారా లేక అతివేగంతో వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.