ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేషనల్‌ న్యూట్రిషన్‌ సర్వేను ప్రారంభించిన గవర్నర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 12:31 PM

హైదరాబాద్‌ : తార్నాకలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ను గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా నేషనల్‌ న్యూట్రిషన్‌ సర్వేను గవర్నర్‌ ప్రారంభించారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ.. సంప్రదాయ ఆహారాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మన సంప్రదాయ ఆహారంలోనే పోషకాలు మెండుగా ఉన్నాయని ఆమె తెలిపారు. సంప్రదాయ ఆహారం తిన్న మన పూర్వీకులు ఎక్కువ కాలం జీవించారు అని గవర్నర్‌ గుర్తు చేశారు. ఆరోగ్య భారత్‌ కోసం అనేక పోషకాహార పథకాలు అమల్లో ఉన్నాయని గవర్నర్‌ పేర్కొన్నారు. 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com