హైదరాబాద్ పాతబస్తీ టప్పాచబుత్రలో బుధవారం ఓ ఇంట్లో చోరీ జరిగింది. టప్పాచబుత్రలో నివాసం ఉండే దుర్గేష్ కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళం విరగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 200 గ్రాముల బంగారం, 25 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్టు నిర్దారించుకున్న దుర్గేష్ స్టేషన్ లో పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.