ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ పెరగనున్న సెల్ ఫోన్ బిల్లులు.. ఈసారి రెట్టింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 02:14 PM

కేంద్ర ఖజానాకు భారీగా బకాయిలు చెల్లించాల్సివున్న టెలికం కంపెనీలు, చార్జీలు పెంచడం మినహా మరో దారి లేదని భావిస్తున్నాయి. గడచిన 20 ఏళ్ల కాలానికి సంబంధించి రేడియో తరంగాలు, ఇతరత్రా బకాయిల రూపంలో టెలికం సంస్థలు మొత్తం రూ.1.47 లక్షల కోట్లను కేంద్రానికి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్‌ టెల్‌ రూ. 35 వేల కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 53 వేల కోట్లు కట్టాలి. ఈ భారాన్ని తట్టుకోవాలంటే, చార్జీలను పెంచాల్సిందే. వచ్చే ఏడాది వ్యవధిలో వినియోగదారుడి నుంచి వచ్చే నెలసరి సగటును రెట్టింపు చేసుకోవాలన్న టార్గెట్ తో టెల్కోలు ఉన్నట్టు తెలుస్తోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com