ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో భారీగా ఉద్యోగాలను భర్తీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 02:22 PM

తెలంగాణలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ-NRRMS. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్-DDU-RID ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 1466 ఖాళీలను భర్తీ చేస్తోంది. టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ అఫీషియల్, డేటా మేనేజర్ లాంటి పోస్టులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 1502 ఖాళీలను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://nrrmsvacancy.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు https://www.nrrmsvacancy.com/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


కంప్యూటర్ ఆపరేటర్- 312


టెక్నికల్ అసిస్టెంట్- 33


డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్- 16


అకౌంట్స్ ఆఫీసర్- 19డేటా మేనేజర్- 48


ఎంఐఎస్ మేనేజర్- 62


ఎంఐఎస్ అసిస్టెంట్- 214


మల్టీ టాస్కింగ్ అఫీషియల్- 228


ఫీల్డ్ కోఆర్డినేటర్- 278


ఫెసిలిటేటర్స్- 256


 


కంప్యూటర్ ఆపరేటర్- రూ.16700


టెక్నికల్ అసిస్టెంట్- రూ.19650


డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్- రూ.26560


అకౌంట్స్ ఆఫీసర్- రూ.22650


డేటా మేనేజర్- రూ.17630


ఎంఐఎస్ మేనేజర్- రూ.17660


ఎంఐఎస్ అసిస్టెంట్- రూ.17030


మల్టీ టాస్కింగ్ అఫీషియల్- రూ.16300


ఫీల్డ్ కోఆర్డినేటర్- రూ.16660


ఫెసిలిటేటర్స్- రూ.16660


 


కంప్యూటర్ ఆపరేటర్- ఇంటర్‌తో పాటు కనీరం 6 నెలల డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ సర్టిఫికెట్ ఉండాలి.


టెక్నికల్ అసిస్టెంట్- డిగ్రీ లేదా 6 నెలల డీసీఏ, కంప్యూటర్ టైపింగ్‌, డేటా ఎంట్రీ, రిపోర్ట్ జనరేషన్‌లో నైపుణ్యం, ఎంఎస్ ఆఫీస్‌లో ఏడాదికి పైగా అనుభవం ఉండాలి. (బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ-IT, బీఎస్సీ-IT, బీసీఏ, పీజీడీసీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది)


డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్- సోషల్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సెక్టార్‌లో ఏడాది అనుభవంతో పీజీ, మూడేళ్ల అనుభవంతో డిగ్రీ ఉండాలి.


అకౌంట్స్ ఆఫీసర్- ఫైనాన్స్, అకౌంట్స్ సంబంధిత అంశాల్లో 2 ఏళ్ల అనుభవంతో డిగ్రీ లేదా పీజీ ఉండాలి.


డేటా మేనేజర్- డిగ్రీతోపాటు కంప్యూటర్ టైపింగ్‌, డేటా ఎంట్రీ, రిపోర్ట్ జనరేషన్‌లో నైపుణ్యం, ఎంఎస్ ఆఫీస్‌లో ఏడాదికి పైగా అనుభవం ఉండాలి. (బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ-IT, బీఎస్సీ-IT, బీసీఏ, పీజీడీసీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది)


ఎంఐఎస్ మేనేజర్- రిపోర్ట్ జనరేషన్‌లో 2 ఏళ్లకు పైగా అనుభవంతో డిగ్రీ, 4 ఏళ్లకు పైగా అనుభవంతో డిప్లొమా ఉండాలి. (బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ-IT, బీఎస్సీ-IT, బీసీఏ, పీజీడీసీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది)


ఎంఐఎస్ అసిస్టెంట్- కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 2 ఏళ్లకు పైగా అనుభవంతో డిప్లొమా లేదా డిగ్రీ. (బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ-IT, బీఎస్సీ-IT, బీసీఏ, పీజీడీసీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది)


మల్టీ టాస్కింగ్ అఫీషియల్- కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 2 ఏళ్లకు పైగా అనుభవంతో 10+2 లేదా డిగ్రీ ఉండాలి.


ఫీల్డ్ కోఆర్డినేటర్- కంప్యూటర్ అప్లికేషన్స్‌లో అనుభవంతో పాటు 10+2 ఉండాలి.


ఫెసిలిటేటర్స్- కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఏడాదికి పైగా అనుభవంతో 10+2 పాస్ కావాలి.


 


నోటిఫికేషన్ విడుదల- 2020 ఫిబ్రవరి 10


దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 13


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 5


వయస్సు- 18 నుంచి 43 ఏళ్లు. (పోస్టును బట్టి వయస్సు మారుతుంది)


ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.250. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com