వెల్లింగ్టన్: భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్లో టామ్ లాథమ్ (11) షాట్కు యత్నించి రిషభ్ పంత్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం 15 ఓవర్లకు కివీస్ 32/1. క్రీజులో టామ్ బ్లండెల్ (16), విలియమ్సన్ (2) ఉన్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 122/5తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ 43 పరుగులే చేసి చివరి అయిదు వికెట్లు కోల్పోయింది. భారత బ్యాట్స్మెన్లో రహానె (46), మయాంక్ అగర్వాల్ (34) ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో జేమీసన్ (4/39), సౌథీ (4/49) రాణించారు. భారత్ కంటే కివీస్ ఇంకా 133 పరుగుల వెనుకంజలో ఉంది.