తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని వీఎస్టీ-ఆర్టీసీ కల్యాణ మండపం రోడ్డులో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ కటౌట్లో కేసీఆర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు తన ఫొటోను కూడా ముఠాగోపాల్ ముద్రించుకున్నారు. రోడ్డుపక్కనే ఏర్పాటు చేసిన ఈ భారీ కటౌట్ను చూసిన ఓ వ్యక్తి దానిని ఫొటో తీసి సీఈసీ-ఈవీడీఎం ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. వెంటనే స్పందించిన ఈవీడీఎం అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కటౌట్ ఏర్పాటు చేసినందుకు గాను ముఠా గోపాల్కు రూ.5 వేల జరిమానా విధించారు. మంత్రి తలసాని శ్రీనివాస్కు కూడా ఇటువంటి సీఎం కటౌట్ విషయంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది.