భారత్లో మాంసాహారులు ఎక్కువే. మటన్, చికెన్, ఫిష్ ఎక్కువగా తింటుంటారు. వీటిల్లో కూడా చికెన్ ఉన్న డిమాండ్ వేరే లెవెల్లో ఉంటుంది. మటన్తో పోలిస్తే చికెన్ ధర తక్కువగా ఉండటం, అలాగే ఫిష్ ఎల్లప్పుడూ టైమ్కి అందుబాటులో ఉండకపోవడం వంటి పలు అంశాల నేపథ్యంలో చికెన్కు ఆదరణ బాగా ఉంటుంది. వారాంతం వచ్చిందంటే చాలు జనాలు చికెన్ షాపుల ముందు క్యూ కడుతుంటారు. ఆదివారం చికెన్ తినేవారు ఎక్కువగా ఉంటారు. ఇక నగరాల్లో అయితే టైమ్తో సంబంధం లేకుండా చాలా మంది చికెన్ బిర్యానీ లాగిస్తూ ఉంటారు.
డిమాండ్ ఉన్న వ్యాపారం చేస్తే నాలుగురాళ్లు వెనకేసుకోవచ్చు. అంటే చికెన్కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందువల్ల చికెన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి రాబడి పొందొచ్చు. మటన్తో పోలిస్తే చికెన్ తినేవారు ఎక్కువగా ఉంటారు. దీనికి ధర కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మటన్ ధర కేజీకి రూ.500 నుంచి రూ.700 మధ్యలో ఉండొచ్చు. అదే చికెన్ విషయానికి వస్తే.. కేజీ చికెన్ ధర రూ.150 నుంచి రూ.200 మధ్యలో కదలాడుతూ ఉంటుంది. అందువల్ల మటన్ షాప్ కన్నా చికెన్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే మంచి రాబడి పొందొచ్చు.
చికెన్ షాప్ పెట్టుకోవడానికి ముందు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మంచి ప్లేస్ చూసుకోవాలి. అంటే జనం బాగా ఉంటే ప్రాంతంలో అంటే రద్దీ ఉన్న చోట చికెన్ షాప్ పెట్టుకుంటే మంచిది. మీకు చికెన్ కొట్టడం వస్తే పర్వాలేదు. రాకపోతే ఒక వ్యక్తిని నెల వారీ జీతానికి పెట్టుకోండి. అలాగే చికెన్ షాప్ శుభ్రంగా ఉండేటా చూసుకోండి. అప్పుడు కస్టమర్లు మళ్లీ మళ్లీ మీ షాప్కు వస్తుంటారు. మీరు కస్టమర్లతో ఎలా మాట్లాడతారనే విషయంపై కూడా మీ బిజినెస్ ఆధారపడి ఉంటుంది.
ఒక కోడి కొనడానికి 10 కోళ్లు కొనడానికి వ్యత్యాసం ఉంటుంది. షాప్ వాళ్లు కూడా ఒక కోడికి ధర తగ్గించుకోకపోవచ్చు. కానీ 10 కోళ్లు కొంటామని చెబితే ధర తగ్గిస్తారు. ఇదే రూల్ చికెన్ షాప్ యజమానికి కూడా వర్తిస్తుంది. వీళ్లు కోళ్లను పెద్ద సంఖ్యలో కొంటుంటారు. అందువల్ల వీళ్లకు కోళ్లు తక్కువ ధరకే వస్తాయి. ప్రాణంతో వీళ్లకు కోళ్లు కేజీకి రూ.80-90 రావొచ్చు. సీజన్నుబట్టి ధరలు అటుఇటుగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు అయితే ధర రూ.45 వద్ద ఉంది. వీళ్లు కస్టమర్లకు ఇదే కోళ్లను రూ.110- రూ.120 వరకు అమ్ముతారు. ప్రస్తుతం ఈ ధర రూ.67గా ఉంది. పౌల్ట్రీ సమాఖ్య చికెన్ రేట్లను నిర్ణయిస్తుంది.