తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45కి చేరింది. బుధవారం వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41 ఉంది. గురువారం రాత్రి 10 గంటల వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45కి చేరింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించింది. నమోదైన కేసుల్లో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. వారు ఇద్దరు కూడా వైద్య దంపతులు. దీంతో డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కరోనా కట్టడి కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్ లోని దోమలగూడ వద్ద ఉన్న 36 ఏళ్ల మహిళా డాక్టర్ కు కరోనా సోకింది. 41 ఏళ్ల ఆమె భర్తకు కూడా కరోనా పాజిటివ్ గా నమోదైంది. సికింద్రాబాద్ లోని బుద్దానగర్ లో 45 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా ఉన్నట్లు తేలింది. ఈయన ఢిల్లీ నుంచి ప్రయాణం చేసినట్లు తెలిసింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45కు చేరింది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనచెందుతున్నారు. ప్రభుత్వాధికారులు కరోనా వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందరూ లాక్ డౌన్ పాటించాలని పాలకులు, అధికారులు, పోలీసులు ప్రజలను వేడుకుంటున్నారు.