ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిశుద్ధ్య కార్మికులను, పోలీసులను అభినందించిన మంత్రి తలసాని...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 05, 2020, 03:47 PM

కరోనా వైరస్‌ మహమ్మారి బారి నుంచి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ సేవలందిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందిని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రశంసించారు. ఈమేరకు  ఆదివారం సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు,ఆశా వర్కర్లకు గులాబీ పూలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. వారికి వాటర్‌బాటిళ్లు, గ్లూకోజ్‌, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రమాదకరమైన కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. పోలీసులు, వైద్యులు, వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని, వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు. ప్రజలు ప్రభుత ్వ సూచనలను పాటించాలని, లాక్‌డౌన్‌ నేపధ్యంలో ఎవరూ అనవసరంగా బయటకు రావద్దని మంత్రి సూచించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com