ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజేంద్రనగర్ లో వ్యాపారస్తులకు పోలీసుల హెచ్చరికలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 09, 2020, 08:58 PM

కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీసులు పలు చర్యలు చేపట్టారు. ఇప్పటికే టీవీల్లో, సామాజిక మాధ్యామాల్లో కరోనా కట్టడికి సంబంధించి పలు ప్రకటనలు జోరుగా కొనసాగిస్తున్నారు. అయితే నిత్యవసర వస్తువులు, కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులను మరోసారి పోలీసులు హెచ్చరించారు. రాజేంద్రనగర్ లోని పలు ప్రాంతాలలో కూరగాయలు విక్రయిస్తున్న ప్రతి వ్యాపారస్తుని ఏసిపి శ్యామ్ బాబు హెచ్చరించారు. కూరగాయల విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరు చేతి గ్లౌజులు, మాస్కులు ధరించడంతో పాటు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని హెచ్చరించారు. ఇలా చేస్తే మనల్ని గత 15 రోజులుగా ఇండ్లకే పరిమితం చేసిన కరోనా రాక్షసిని తరమికొట్టవచ్చు అని తెలిపారు. రాజేంద్రనగర్ ఎర్రబోడ గ్రామంలో కొనసాగుతున్న కూరగాయల మార్కెట్ ను ఎస్ ఐ శ్వేత తో పాటు ఏసిపి శ్యామ్ బాబు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులను హెచ్చరించారు. మీరు తప్పకుండా మేము తెలిపిన సూచనలను పాటించి కరోనా మహమ్మారి వ్యాపించకుండా మాకు సహకరించాలని అన్నారు. ఎవరైనా మేము చెప్పిన సూచనలు పాటించక పోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com