గోషామాల్ నియోజకవర్గం లోని లాల్ బహదూర్ స్టేడియంలో స్పైర్ట్స్ చైర్మన్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన బియ్యం, పప్పు, ఉప్పు, పసుపు, నూనె, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి లతో కూడిన కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ హాజరై పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ లాంటి పరిస్థితులలో పెద్ద మనసుతో దాతలు ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.