ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన మంత్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 09, 2020, 09:15 PM

కూకట్ పల్లి నియోజకవర్గం లోని ఓల్డ్ బోయిన్ పల్లి సదాశివ హై స్కూల్ ఆవరణలో ఓల్డ్ బోయిన్ పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహా ఆధ్వర్యంలో పేద ప్రజలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుపేదలు ఎందరో ఆకలితో అలమటిస్తూ అస్తవ్యస్తమైన జీవనం గడపవలసిన విపత్కరమైన పరిస్థితి నెలకొంది. కాబట్టి పేదల పడుతున్న బాధలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వారికి బియ్యం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్, జాయింట్ కమీషనర్ మమత, కార్పొరేటర్లు, టి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com