కూకట్ పల్లి నియోజకవర్గం లోని ఓల్డ్ బోయిన్ పల్లి సదాశివ హై స్కూల్ ఆవరణలో ఓల్డ్ బోయిన్ పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహా ఆధ్వర్యంలో పేద ప్రజలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుపేదలు ఎందరో ఆకలితో అలమటిస్తూ అస్తవ్యస్తమైన జీవనం గడపవలసిన విపత్కరమైన పరిస్థితి నెలకొంది. కాబట్టి పేదల పడుతున్న బాధలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వారికి బియ్యం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్, జాయింట్ కమీషనర్ మమత, కార్పొరేటర్లు, టి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.