తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు చేపడుతున్న కార్యక్రమాలు, సహాయక చర్యల కోసం తమ వంతుసాయంగా ఇమ్యునోలాజికల్ లిమిటెడ్ సీఎం సహాయనిధికి 1కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును శుక్రవారం ప్రగతి భవన్లో కంపెనీ ఎండి డాక్టర్ కె.ఆనంద్కుమార్, డిప్యూటీ ఎండి ప్రసన్న దేశ్పాండే, వైస్ ప్రెసిడెంట్ ముత్తయ్య ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు అందజేశారు.