శనివారం రోజు మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం మండల కేంద్రంలో శ్రీ పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వానాకాలం పంటలు సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ తీగల అనిత హారినాథ్ రెడ్డి, మహేశ్వరం మండలం ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ జ్యోతి, కందుకూరు మండలం ఎంపీపీ జ్యోతి, సహకార బ్యాంకు ఛైర్మన్ పాండు, వైస్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, కూన యాదయ్య, రాఘవేంద్రర్ రెడ్డి, యతం పవన్ కుమార్ యాదవ్, డి. చంద్ర శేఖర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురసాని వరలక్ష్మి సురేందర్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీ లు పాల్గొన్నారు.