గవర్నర్ తమిళిసైతో శనివారం బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. లాక్ డౌన్ సమయంలో కాళేశ్వరం మూడో ప్యాకేజీకి టెండర్లు పిలవడంపై శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు సాగునీటి ప్రాజెక్టులలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందన్నారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచారని, కొంత మంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే టెండర్లు పిలిచారని ఆరోపించారు. ప్రాజెక్టులపై విచారణ జరిపించి… దోపిడీని అరికట్టాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు బీజేపీ నేతలు. గవర్నర్ ను కలిసిన వారిలో బండి సంజయ్, వివేక్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొంగులేటి తదితర బీజేపీ నేతలు ఉన్నారు.