తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1813కి చేరింది. ఇప్పటి వరకు 1068 మంది డిశ్చార్జు కాగా 49 మంది మరణించారు. ప్రస్తుతం 696 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు వరంగల్ రూరల్,యాదాద్రి,వనపర్తి జిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గత 14 రోజులుగా కరీంనగర్,సిరిసిల్ల,కామారెడ్డి,మహబూబ్ నగర్,మెదక్,భూపాలపల్లి,నాగర్ కర్నూల్,ములుగు,పెద్దపల్లి,సిద్దిపేట,మహబూబాబాద్,మంచిర్యాల,భద్రాద్రి కొత్తగూడెం,వికారాబాద్,నల్లగొండ,ఆసిఫాబాద్,ఖమ్మం,నిజామాబాద్,ఆదిలాబాద్,సూర్యాపేట, నారాయణపేట,వరంగల్ అర్బన్, గద్వాల్,జనగాం,నిర్మల్ జిల్లాలలో కేసులు నమోదు కాలేదు. రోజు నమోదవుతున్న కేసులలో హైదరాబాద్ జిల్లాలోనే అధిక కేసులు నమోదు అవుతున్నాయి. రోజురోజుకు జీహెచ్ఎంసీ ప్రాంతంలో కరోనా వ్యాప్తి వేగం పెరుగుతుంది. ఇక్కడ నివసించే ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా వ్యాప్తి మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంది. రోజురోజుకు హైదరాబాద్ ప్రాంతం డేంజర్ గా మారుతుంది. దీంతో ప్రజలు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది.