హైదరాబాద్ నగరంలోని చింతల్ బస్తీ విజయమేరీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మూడు రోజుల క్రితం బిడ్డకు జన్మ ఇచ్చిన తల్లి ఆర్తీ(24) అకారణంగా మృతి చెందింది. సోమవారం రాత్రి వరకు ఆర్యోగ్యాంగా ఉన్న తల్లి హఠాత్తుగా మృతి చెందిందని వైద్యులు తెలపడంతో ఆసుపత్రి ముందు బంధువులు ధర్నా నిర్వహించారు. అనుభవం లేని వైద్యులతో చికిత్స చేయించి మా బిడ్డ ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.