తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని 31వ డివిజన్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్త మనోహర్ రెడ్డి, మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, మాజీ చైర్మన్ యాతం శ్రీశైలం యాదవ్, మహేశ్వరం నియోజకవర్గం బిసిసెల్ అధ్యక్షులు నిమ్మల నరేందర్ గౌడ్, మున్సిపల్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు అమృత నాయుడు, కార్పొరేషన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పుట్టగల్ల సంతోష్ కుమార్ మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాళ్లు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.