కోవిడ్ రోగులకు చికిత్స అందించే గాంధీ ఆస్పత్రిలో వ్యర్థాల గుట్టలు పేరుకుపోవడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యర్థాలను 15 రోజులకోసారి కూడా తొలగించకపోవడం సరికాదంటూ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూలై 28లోగా తమకు నివేదిక సమర్పించాలని మానవహక్కుల కమిషన్ ఆదేశించింది.