తెలంగాణ కరోనా బులెటిన్ విడుదలైంది. తెలంగాణలో నిన్న 945 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,339కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 7294 మంది డిశ్చార్జ్ అవ్వగా 260 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 8,785 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఏడుగురు మరణించగా 1712 మంది డిశ్చార్జ్ అయ్యారు.
హైదరాబాద్ లో 869,రంగారెడ్డి 29,మేడ్చల్ 13,సంగారెడ్డి 21,కరీంనగర్ 2,సిద్దిపేట 1,నిర్మల్ 4,మహబూబ్ నగర్ 2,సూర్యాపేట,ఖమ్మం,వికారాబాద్,నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.