తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. గత వారం రోజులుగా రోజుకు 1500 కు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. తెలంగాణాలో గత 24 గంటల్లో కొత్తగా 1,879 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఏడుగురు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 313 కు చేరుకుంది. నమోదైన 1,879 కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలోనే 1,422 కేసులు వెలుగుచూశాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్ లో 94 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 27,612 పాజిటీవ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,012 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 16,287 మంది కరోనా నుండి కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. రోజురోజుకూ భారీగా నమోదవుతున్న కేసులు భాగ్యనగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో కూడా ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువగా కనపడుతుంది. బస్తీల్లో, కాలనీలలో కూడా కేసులు నమోదవడంతో ప్రజలు ఇంటి నుండి కాలు బయటపెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.