తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పులు శిశుపాలుడి తరహాలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకాలం ప్రజాతీర్పు తనకు అనుకూలంగా ఉందని విర్రవీగిన దొరగారు ప్రజల తిరస్కారాన్ని, తిరుగుబాటును ఎదుర్కొనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విజయశాంతి మండి పడ్డారు.