ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రెండు కంపెనీలకు ట్రాయ్ షాక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 13, 2020, 04:02 PM

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI షాక్ ఇచ్చింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్రీమియం ప్లాన్స్‌ను ట్రాయ్ రద్దు చేసింది. భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ప్లాటినమ్, వొడాఫోన్ ఐడియాకు చెందిన రెడ్‌ఎక్స్ ప్రీమియం ప్లాన్స్‌ను ట్రాయ్ బ్లాక్ చేసింది. ఈ ప్లాన్స్ తీసుకున్నవారికి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఫాస్టర్ డేటా స్పీడ్, ప్రియార్టీ సర్వీసెస్ అందిస్తున్నాయి. వారికి కస్టమర్ కేర్ సేవలు ప్రత్యేకంగా లభిస్తాయి. ఈ ప్లాన్స్ వల్ల మొబైల్ క్వాలిటీ సర్వీసెస్ తగ్గుతాయని, ఈ ప్లాన్స్ ఎంచుకోనివారు నష్టపోతారని ట్రాయ్ భావించింది. అందుటే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రీమియం ప్లాన్స్‌ను ట్రాయ్ రద్దు చేసింది. ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలకు షాక్ ఇచ్చింది. కనీసం ఈ టెలికామ్ కంపెనీలు స్పందించే అవకాశం కూడా ఇవ్వకుండా ట్రాయ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ప్లాన్స్ వల్ల నాణ్యత తగ్గడంతో పాటు, నెట్ న్యూట్రాలిటీ నిబంధనల్ని ఉల్లంఘించే అవకాశం ఉందని ట్రాయ్ భావిస్తోంది. అందుకే ఈ ప్రీమియం ప్లాన్స్‌ని రద్దు చేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com