తెలంగాణ సచివాలయం కూల్చివేతకు మళ్లీ బ్రేక్ పడింది. కూల్చివేత అంశం పై కొనసాగుతున్న స్టేను జూలై 15 వరకు హైకోర్టు పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టి ఈ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం కూల్చివేతకు సంబంధించి కేబినేట్ నిర్ణయాన్ని సీల్డ్ కవర్ లో అందజేయాలని న్యాయమూర్తిని ఏజీని ఆదేశించారు. సోమవారం సాయంత్రం వరకు సమర్పిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను జూలై 15 వరకు న్యాయమూర్తి వాయిదా వేశారు.