సరూర్నగర్ డివిజన్ లోని డాక్టర్స్ కాలనీకి చెందిన కాయ వెంకటమ్మ ప్రమాదానికి గురై ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్నారు. వైద్యానికి పెద్దమొత్తంలో ఖర్చు కాగా టీఆర్ఎస్ నాయకులు బేర బాలకిషన్, ఆకుల అరవింద్ కుమార్ మంత్రి సబితాఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారు. రూ.60 వేలు మంజూరు కాగా ఆ చెక్కును మంత్రి సబితాఇంద్రారెడ్డి బాధితురాలికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, డివిజన్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్ పా