తెలంగాణాలోని 61 మంది గురువులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికచేసింది తెలంగాణ సర్కార్. ఉత్తమ టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల లిస్టును రాష్ర్ట ప్రభుత్వం శుక్రవారం జాబితా విడుదల చేసింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ జీవో జారీచేశారు. వారందరికీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ మరణం వల్ల 7 రోజులు సంతాపదినాలు ముగిసిన తర్వాత అవార్డులు ప్రదానం చేయనున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 48 మందిని, వర్సిటీల పరిధిలో 12 మందిని, స్పెషల్ కేటగిరీలో ఒకరిని అవార్డుల కు ఎంపిక చేసింది. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో జీహెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్ 12 మంది.. ఎస్ఏ, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కోటాలో 23 మంది, ఎస్టీజీ/ పీఈటీ/ఎల్పీ/డైట్ కోటాలో 13మందిని సెలెక్ట్ చేసింది. వీరితో పాటు ఓయూ నుంచి ఐదుగురు, కేయూ నుంచి నలుగురు, తెలంగాణ, శాతవాహన వర్సిటీల నుంచి ఒక్కొక్కరు , పీడీ కేటగిరిలో ఒకరు ఎంపికయ్యారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీ లెక్చరర్ సదాశివయ్యకు స్పెషల్ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో అవార్డులను డీఈవోల ద్వారా ఉపాధ్యాయుల ఇంటి వద్దే అందించనున్నారు.