జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 110 మందికి పరీక్షలు నిర్వహించగా 22 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, సూపరింటెండెంట్ డాక్టర్ రాజు తెలిపారు. 15 మందికి ఐసోలేషన్ కిట్స్ పంపిణీ చేశామని, ఆరుగురు ఇన్ పేషెంట్స్ గా చికిత్స పొందుతున్నారన్నారు. మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఐదు సెంటర్లలో 91 మందికి పరీక్షలు నిర్వహించగా 18 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని నోడల్ అధికారి డాక్టర్ రెడ్డి కుమారి తెలిపారు. మౌలాలి ప్రశాంత్ నగర్ కి చెందిన వృద్ధుడు(65) ఈఎస్ఐ సనత్ నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని అధికారులు తెలిపారు. అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో బుధవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలలో మొత్తం 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అల్వాల్ లో 35 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. మచ్చ బొల్లారం లో 21 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. సుభాష్ నగర్ లో 18 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఆనంద్ తెలిపారు.