ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సన్‌రైజర్స్‌కు మార్ష్‌ దూరం..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 22, 2020, 02:49 PM

దుబాయ్ ఐపీఎల్‌-13వ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ గాయపడ్డాడు. బౌలింగ్‌ చేస్తుండగా కాలి మడమ మడత పడటంతో తీవ్ర నొప్పితో బాధపడిన మిచెల్‌ మైదానం వీడాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తున్నది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో లీగ్‌ నుంచి తప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మిడిలార్డర్‌లో సరైన ఆటగాళ్లు లేకపోవడంతోనే సన్‌రైజర్స్‌ ఓటమితో 2020 సీజన్‌ను ప్రారంభించింది.


మిడిలార్డర్‌లో నమ్మకమైన బ్యాట్స్‌మన్‌ మార్ష్‌. ఇటీవల ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ గొప్పగా రాణించాడు. నిన్నటి మ్యాచ్‌లో  అతడు ముందుగా బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే సన్‌రైజర్స్‌ గెలిచేది.  గాయం కారణంగా ఆఖర్లో బ్యాటింగ్‌ వచ్చిన మిచెల్‌ ఒక బంతికే ఔటై..కుంటుతూ మైదానాన్ని వీడాడు.  అతని స్థానంలో వరల్డ్‌నంబర్‌ వన్‌ టీ20 ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ తుదిజట్టులోకి రానున్నాడు.  


 


'బలమైన గాయం అయినట్లు తెలుస్తున్నది. ఏ ఒక్క మ్యాచ్‌లోనూ అతడు ఆడుతాడనే నమ్మకంలేదని' ఫ్రాంఛైజీ చెందినవారు ఒకరు తెలిపారు.  మార్ష్‌ గాయంపై టీమ్‌ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.  మార్ష్‌ స్థానంలో 37ఏండ్ల డేన్‌ క్రిష్టియన్‌ను తీసుకోవాలని సన్‌రైజర్స్‌ భావిస్తున్నది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌, ఎడమచేతివాటం సీమర్‌ అయిన క్రిష్టియన్‌ ఐపీఎల్‌లో 40 మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతనికున్నది.  










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com