నాయిబ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన నాయిబ్రాహ్మణులకు గాజుల రామారం డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ లో కమ్యూనిటీ హాల్ కొరకు ఈరోజు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సమగ్ర వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని, పేద వారు కూడా ఆత్మగౌరవంతో పండగలు, శుభకార్యాలు జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో కమ్యూనిటీ హాల్ లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అట్టడుగు వర్గాలకు గుర్తింపు లభిస్తోందని, స్వరాష్ట్ర సాధనలో పేదల కష్టాలను దగ్గరగా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి సంక్షేమాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావు, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ రామ్ రెడ్డి, నాయి బ్రాహ్మణ సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు జగదీష్ నాయి, నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటేష్ నాయి, ప్రధాన కార్యదర్శి గణేష్ నాయి, ఉపాధ్యక్షుడు రవి, మధు, సురేష్ నాయి, సంగమేష్ నాయి, విఎస్ఆర్ నాయి, సంతోష్ నాయి, నాగరాజు నాయి, కాశిరమ్ నాయి తదితరులు పాల్గొన్నారు.