ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీను తెలిపిన వివరాల మేరకు.. అడ్డగుట్ట జీఎం అంజయ్య విగ్రహాం సమీప ప్రాంతానికి చెందిన పర్వీనా సుల్తానా (22) వృత్తిరీత్యా ఓ ప్రైవేటు కంపెనీలో టెలికాలర్ గా పని చేస్తుంది. అయితే, ఈ నెల 21న ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లింది. కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగొచ్చే సరికి పర్వీనా కనిపించకపోవడంతో తెలిసిన వారికి, బంధువులకు వాకాబు చేశారు. ఎంతగానో వెతికారు. ఫలితం కనిపించకపోవడంతో పర్వీనా సోదరుడు మస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసు కున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.