బీఆర్కేఆర్ భవన్లో సీఎస్ సోమేశ్ కుమార్ తో కేంద్ర బృందం భేటీ అయ్యారు. రెండు బృందాలుగా విడిపోయి రాష్ట్రంలో వరద పరిస్థితిని అధ్యయనం చేయనున్న కేంద్రం బృందం. మరికాసేపట్లో పాతబస్తీ చంద్రాయన గుట్ట పల్లె చెరువు, ఇతర వరద ముంపు ప్రాంతాలను సందర్శించనుంది ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం. మరికాసేపట్లో సిద్దిపేట బయలుదేరనున్న మరో ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం. జిల్లాల్లో పంట నష్టాన్ని కూడా అంచనా వేయనుంది కేంద్రబృందం. పర్యటన తరవాత రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్న కేంద్ర బృందం.