మీసేవా కేంద్రాలలోనూ రూ.200 లు చెల్లించి ధరణి కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. ధరణి సేవలను ఈ రోజు లాంఛనంగా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే పెండింగ్ లో ఉన్న మ్యుటేషన్లపై త్వరలోనే ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా ఒక్క శాతం కూడా అవినీతి లేని విధానం ధరణి అని ఆయన పేర్కొన్నారు. కాంక్ష.