ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో 602 కొత్త కేసులు.. ముగ్గరు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 23, 2020, 12:02 PM

గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 602 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,64,128 కు చేరింది. 24 గంటల్లో ముగ్గురు కరోనాతో మరణించగా.. మృతుల సంఖ్య 1,433కు చేరింది. తాజాగా 1,015 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,51,468 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 11,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 24,139 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ ల సంఖ్య 51,58,474 కు చేరింది. జిల్లాల వారీగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 129, ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 25, జగిత్యాల్‌ 34, జనగాం 2, జయశంకర్ భూపాలపల్లి 3, జోగులమ్మ గద్వాల్‌ 5, కామారెడ్డి 3, కరీంనగర్‌ 51, ఖమ్మం 16, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 1, మహబూబ్‌ నగర్‌ 10, మహబూబాబాద్‌ 11, మంచిర్యాల్‌ 18, మెదక్‌ 5, మేడ్చల్ మల్కాజ్‌గిరి 60, ములుగు 8, నాగర్‌ కర్నూల్‌ 10, నల్గొండ 21, నారాయణ్‌పేట్‌ 1, నిర్మల్‌ 3, నిజామాబాద్‌ 6, పెద్దంపల్లి 5, రాజన్న సిరిసిల్ల 6, రంగారెడ్డి 62, సంగారెడ్డి 24, సిద్ధిపేట్‌ 16, సూర్యాపేట 18, వికారాబాద్‌ 4, వనపర్తి 4, వరంగల్‌ రూరల్‌ 9, వరంగల్‌ అర్బన్‌ 27, యాద్రాది భువనగిరి 2 కేసులు నమోదయ్యాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com